అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం

  • ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
  • దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి
  • మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు ప్రకటన
  • మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు అధికారులకు ఆదేశాలు
  • రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ నిరంతర సంప్రదింపులు
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన అమెరికా క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సురేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో ఏపీ భవన్ అధికారులు ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒమన్ ప్రభుత్వం, భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

సురేష్ ప్రయాణిస్తున్న నౌక ప్రస్తుతం ఒమన్ తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయినట్లు సమాచారం. ఒమన్ అధికారులు నౌకను పోర్టుకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ అర్ధరాత్రికి నౌక ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోర్టుకు చేరిన తర్వాత మృతదేహాన్ని అధికారికంగా గుర్తించి, భారత్‌కు తరలించే ప్రక్రియను ప్రారంభిస్తారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Patnala Suresh
US Missile Attack
Marine Engineer Death
Chandrababu Naidu
Oman Oil Tanker Attack
Visakhapatnam Engineer

More Telugu News